నరేగా కార్మికులకు ముందస్తు వేతనాలివ్వాలంటూ మోదీకి సోనియా లేఖ

ABN , First Publish Date - 2020-04-01T22:28:49+05:30 IST

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నరేగా కార్మికులకు ముందస్తు వేతనాలను మంజూరు చేయాలంటూ కాంగ్రెస్

నరేగా కార్మికులకు ముందస్తు వేతనాలివ్వాలంటూ మోదీకి సోనియా లేఖ

న్యూఢిల్లీ : ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నరేగా కార్మికులకు ముందస్తు వేతనాలను మంజూరు చేయాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని మోదీకి బుధవారం ఓ లేఖ రాశారు. 21 రోజుల ముందస్తు వేతనాన్ని వారికి ముందే అందజేసి వారికి సహాయాన్ని అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కార్మికులకు పని లేదని, అలాగే నరేగా కార్మికులకు కూడా వేతనాలు లేవని, ఈ పరిస్థితి దృష్ట్యా వారికి ముందస్తు వేతనాలను మంజూరు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది కూలీలున్నారని, వెంటనే వారికి ముందస్తు వేతనాలను మంజూరు చేయాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. 

Updated Date - 2020-04-01T22:28:49+05:30 IST