ప్రజాస్వామ్యం అత్యంత క్లిష్టమైన దశలో ఉంది: సోనియా గాంధీ

ABN , First Publish Date - 2020-10-19T02:11:04+05:30 IST

మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం కుంచించుకుపోతూ వస్తోంది. ప్రస్తుతం మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత క్లిష్టమైన దశలో ఉంది. వ్యవసాయ నూతన చట్టాలతో ప్రజలపై ప్రభుత్వం దాడికి

ప్రజాస్వామ్యం అత్యంత క్లిష్టమైన దశలో ఉంది: సోనియా గాంధీ

న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యం అత్యంత క్లిష్టమైన దశలో ఉందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రజా సమస్యలకు తోడు ప్రభుత్వం మరిన్ని సమస్యలు సృష్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని పతనం దిశగా తీసుకువెళ్తున్నారని ఆమె మండిపడ్డారు. కోవిడ్-19, ఆర్థిక మాంద్యానికి తోడు ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చి దేశ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం కుంచించుకుపోతూ వస్తోంది. ప్రస్తుతం మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత క్లిష్టమైన దశలో ఉంది. వ్యవసాయ నూతన చట్టాలతో ప్రజలపై ప్రభుత్వం దాడికి దిగుతోంది. కోవిడ్-19పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. అత్యంత దిగువకు ఆర్థిక మాంద్యం పడిపోయింది. దళితులపై దాడులు తీవ్ర స్థాయికి పెరిగాయి. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలే. మోదీ ప్రభుత్వం వీటన్నిటికీ కారణం’’ అని సోనియా గాంధీ అన్నారు.

Updated Date - 2020-10-19T02:11:04+05:30 IST