కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకులు

ABN , First Publish Date - 2020-08-04T18:59:39+05:30 IST

అంబర్‌పేట, గోల్నాకలో దారుణం జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న..

కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకులు

హైదరాబాద్: అంబర్‌పేట, గోల్నాకలో దారుణం జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లి కమలమ్మ (77)ను ముగ్గురు కొడుకులు నడి రోడ్డుపై వదిలేశారు. కొద్ది రోజుల క్రితం కమలమ్మ భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె కొడుకులవద్దే ఉంటోంది. భర్త పేరున ఉన్న ఆస్తిని కొడుకులు రాయించుకున్నారు. తర్వాత ఆమెను వదిలేశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి మొత్తం తీసుకుని తల్లిని నడిరోడ్డుపై వదిలేయడం సరికాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి కమలమ్మ కొడుకులను సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


Updated Date - 2020-08-04T18:59:39+05:30 IST