నిసర్గ బాధితులకు సోనూ సూద్ సాయం
ABN , First Publish Date - 2020-06-05T08:27:25+05:30 IST
సినీనటుడు సోనూసూద్ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు. ఇప్పటికే వలస కార్మికులను ఆదుకుంటున్న సోనూ.. తాజాగా ముంబైలోని ‘నిసర్గ’ తుఫాను బాధిత నిరుపేదలకు అండగా నిలిచారు...
- 28వేల మందికి ఆహారం, ఆశ్రయం కల్పించిన నటుడు
ముంబై, జూన్ 4: సినీనటుడు సోనూసూద్ మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు. ఇప్పటికే వలస కార్మికులను ఆదుకుంటున్న సోనూ.. తాజాగా ముంబైలోని ‘నిసర్గ’ తుఫాను బాధిత నిరుపేదలకు అండగా నిలిచారు. దీని పై ఆయన గురువారం ఒక ప్రకటనను విడుద ల చేశారు. ‘‘ఈరోజు మనమంతా తీవ్ర ప్రతికూ ల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం. ఒకరికి ఒకరు అండగా నిలవడమే వాటిని దాటేందుకు మార్గం. ఇప్పటివరకూ సుమారు 28వేలమందికి నేను, నా బృందం ఆహారాన్ని సరఫరా చేయగలిగాం. వారందరినీ తీరప్రాంతాల నుంచి మునిసిపాలిటీ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల భవనాలకు తరలించి ఆశ్రయం కల్పించాం. వారు సురక్షితంగా ఉండేలా చూస్తున్నాం’’ అని పేర్కొన్నారు. తుఫాను కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన మరో 200మంది అసోం వాసులకు నీడ కల్పించి, ఆహారాన్ని అందించినట్లు ఆయన స్పష్టం చేశారు.