ఫిలిప్పిన్స్లో చిక్కుకున్న భారతీయుల కోసం.. సోనూ సూద్ ప్రత్యేక విమానం!
ABN , First Publish Date - 2020-08-13T06:09:08+05:30 IST
రీల్ లైఫ్లో విలన్గా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్.. రియల్ లైఫ్లో మాత్రం.. అందరి దృష్టిలో హీరో అయ్యారు. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న
న్యూఢిల్లీ: రీల్ లైఫ్లో విలన్గా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్.. రియల్ లైఫ్లో మాత్రం.. అందరి దృష్టిలో హీరో అయ్యారు. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలిచి ఆత్మబంధువయ్యారు. లాక్డౌన్ సమయంలో సొంత ఖర్చుతో వలస కూలీలను వారి స్వగ్రామాలకు పంపిన ఆయన.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కూడా ఇండియాకు తరలించేందుకు చురుకుగా పని చేస్తున్నారు. ఇప్పటికే ఆఫ్గనిస్థాన్లో చిక్కుకున్న వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. తాజాగా ఫిలిప్పిన్స్లో చిక్కుకున్న వారి కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే వెల్లడించారు. ఫిలిప్పిన్స్లో చిక్కుకున్న భారతీయులను తరలించడం కోసం ఆగస్ట్ 14న మనీల నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫిలిప్పిన్స్లో చిక్కుకున్న వారిని ఉద్దేశిస్తూ.. ‘ఆగస్ట్ 14న మనీల నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాను. మీ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను’ అంటూ పోస్ట్ చేశారు.