త్వరలో జిల్లాకు 100 ఎలక్ర్టిక్‌ బస్సులు: ఆర్‌ఎం

ABN , First Publish Date - 2022-01-27T08:06:47+05:30 IST

త్వరలోనే జిల్లాకు వంద ఎలక్ర్టిక్‌ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి తెలిపారు.

త్వరలో జిల్లాకు 100 ఎలక్ర్టిక్‌ బస్సులు: ఆర్‌ఎం
జెండాను ఎగురవేస్తున్న చెంగల్‌రెడ్డి

తిరుపతి(కొర్లగుంట), జనవరి 26: త్వరలోనే జిల్లాకు వంద ఎలక్ర్టిక్‌ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని తన కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ చూపిన ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. వంద బస్సుల్లో తిరుమల ఘాట్‌లో 50 నడుపుతామని, మిగిలిన 50 బస్సులను నాన్‌స్టా్‌ప సర్వీసులుగా నగరాలకు తిప్పడం జరుగుతుందన్నారు. అనంతరం బస్టాండులోని కార్గో కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొవిడ్‌ నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించి, మాస్కుల్లేని వారికి ఉచితంగా పంపిణీ చేశారు. బస్టాండు ఏటీఎం డీఆర్‌ నాయుడు పాల్గొన్నారు. అలాగే తిరుపతి, మంగళం, అలిపిరి డిపో మేనేజర్లు బాలాజీ, రాజవర్ధన్‌రెడ్డి, హరిబాబు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించి ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. 

Updated Date - 2022-01-27T08:06:47+05:30 IST