జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్...ముగ్గురు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2021-06-21T12:16:03+05:30 IST

జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోరిలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు....

జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్...ముగ్గురు ఉగ్రవాదుల హతం

సోపోరి (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోరిలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ ముదసర్ పండిట్ మరణించాడు. మృతుడు ముదసర్ పండిట్ గతంలో ముగ్గురు పోలీసులు, నలుగురు ఇతరులను చంపిన కేసుల్లో నిందితుడని పోలీసులు చెప్పారు. ముదసర్ గతంలో ఇద్దరు పౌరులు, ఇద్దరు కౌన్సిలర్లు, ముగ్గురు పోలీసులను చంపిన కేసుల్లో ప్రధాన నిందితుడని ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు. సోపోరిలోని గుండ్ బ్రాత్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదుల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-06-21T12:16:03+05:30 IST