హమ్మయ్య.. ఎట్టకేలకు భారత్కు ఓ వికెట్
ABN , First Publish Date - 2022-01-22T01:45:01+05:30 IST
భారత్తో జరుగుతున్న రెండో వన్డేల్లో దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తోంది.
పార్ల్: భారత్తో జరుగుతున్న రెండో వన్డేల్లో దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తోంది. వికెట్ల కోసం చెమటోడుస్తున్న భారత బౌలర్లు 22వ చివరి బంతికి తొలి వికెట్ సాధించగలిగారు. అప్పటికే చెడామడా బాదేసి బలమైన పునాది వేసిన డికాక్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. మొత్తం 66 బంతులు ఎదుర్కొన్న డికాక్ 7 ఫోర్లు, మూడు సిక్సర్లతో 78 పరుగులు చేశాడు.
మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన మరో ఓపెనర్ జానెమన్ మలాన్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 132 పరుగుల బలమైన భాగస్వామ్యాన్ని అందించారు. భారత జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐదుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయోగిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం 23 ఓవర్లు ముగిశాయి. దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 142 పరుగులు చేసి విజయానికి 146 దూరంలో నిలిచింది.