నేటి నుంచి ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
ABN , First Publish Date - 2021-05-05T11:56:08+05:30 IST
వేసవి కాలం నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది
హైదరాబాద్: వేసవి కాలం నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇవన్నీ రిజర్వేషన్ రైళ్లని, ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని వివరించింది. బుధవారం నుంచి బనా్సవాడి-ధర్మవరం, ధర్మవరం-బనా్సవాడి రైళ్లు, ఈ నెల 6, 7 తేదీల్లో మైసూరు-దానాపూర్, 6న వాస్కోడిగామా-దానాపూర్, యశ్వంత్పూర్-దానాపూర్ రైళ్లను నడపనున్నామని తెలిపింది. కాగా, పలు సమస్యల కారణంగా ఈ నెల 13న యశ్వంత్పూర్-హౌరా, హౌరా-యశ్వంత్పూర్ రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది.