దక్షిణాది మార్కెటే కీలకం

ABN , First Publish Date - 2020-02-21T06:39:05+05:30 IST

: ఫర్నీచర్‌ బ్రాండ్‌ గోద్రెజ్‌ ఇంటీరియో హైదరాబాద్‌లో తొలి సోషల్‌ ఆఫీస్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను గురువారంనాడు ప్రారంభించింది.

దక్షిణాది మార్కెటే కీలకం

  • గోద్రెజ్‌ ఇంటీరియో వెల్లడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఫర్నీచర్‌ బ్రాండ్‌ గోద్రెజ్‌ ఇంటీరియో హైదరాబాద్‌లో తొలి సోషల్‌ ఆఫీస్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను గురువారంనాడు ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనిల్‌ మాథుర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే ముంబై, కోల్‌కతాలో ఈ సెంటర్లను ప్రారంభించామని, రానున్న కాలంలో బెంగళూరు, చెన్నై, పుణే, చండీగఢ్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. గోద్రెజ్‌ ఇంటీరియో దక్షిణాది వ్యాపారంలో హైదరాబాద్‌ మార్కెట్‌ వాటా 45 శాతంగా ఉందని చెప్పారు. ఇక్కడ వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్నందున తమ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ప్రారంభించామని, ఇందులో 45-50 రకాల కాన్సె్‌ప్టలు, ఎలిమెంట్స్‌ ఉంటాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రాబడి రూ.2,400 కోట్లకు చేరుకునే అవకాశం ఉంద ని, వచ్చే ఏడాది రూ.3,000 కోట్లను తాకవచ్చని చెప్పారు. 

Updated Date - 2020-02-21T06:39:05+05:30 IST