24 నుంచి సదరన్‌ డిస్కం ప్రజాభిప్రాయ సేకరణ

ABN , First Publish Date - 2022-01-23T06:09:23+05:30 IST

ఏపీ సదరన్‌ డిస్కం నిర్వహించే బహిరంగ అభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి విద్యుత్‌ వినియోగదారులు తమ పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలని తిరుపతి సర్కిల్‌ సూపరింటెండెంట్‌ డీవీ చలపతి తెలిపారు.

24 నుంచి సదరన్‌ డిస్కం ప్రజాభిప్రాయ సేకరణ

చర్చలో పాల్గొనాలనుకుంటే ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి


తిరుపతి(ఆటోనగర్‌), జనవరి 22: ఏపీ సదరన్‌ డిస్కం నిర్వహించే బహిరంగ అభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి విద్యుత్‌ వినియోగదారులు తమ పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలని తిరుపతి సర్కిల్‌ సూపరింటెండెంట్‌ డీవీ చలపతి తెలిపారు. ఈనెల 24, 25, 27 తేదీల్లో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారని పేర్కొన్నారు. చర్చలో పాల్గొన దలచిన వినియోగదారులు తిరుపతిలోని తమ కార్యాలయంతోపాటు, తిరుపతిటౌన్‌, రూరల్‌, పుత్తూరు, చిత్తూరు, పీలేరు, మదనపల్లె ఈఈ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2022-01-23T06:09:23+05:30 IST