14న తిరుపతిలో దక్షిణరాష్ట్రాల సదస్సు
ABN , First Publish Date - 2021-11-04T20:56:15+05:30 IST
ఈనెల 14న తిరుపతిలో 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ కార్యక్రమం (దక్షిణాది రాష్ట్రాల సదస్సు) జరగనుంది.
తిరుపతి: ఈనెల 14న తిరుపతిలో 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ కార్యక్రమం (దక్షిణాది రాష్ట్రాల సదస్సు) జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్దీవులు, లక్షద్వీప్ లెఫ్ట్నెంట్ గవర్నర్లు పాల్గొంటారు. ఇప్పటికే ఈ సమావేశంలో చర్చించే అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామని అధికారులు, జగన్కు వివరించారు. తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలులు పోలవరం ప్రాజెక్టు బకాయిలు, రెవిన్యూలోటు, రేషన్ బియ్యంలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిల అంశాలపై చర్చించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.