ఎస్పీ బాలు మరణం దురదృష్టకరం: జస్టిస్‌ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2020-09-26T01:51:18+05:30 IST

ఎస్పీ బాలు మరణం దురదృష్టకరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. ఎస్పీ బాలు మృతి తెలుగు జాతికే కాదని, సంగీత ప్రపంచానికే తీరని లోటని వ్యాఖ్యానించారు.

ఎస్పీ బాలు మరణం దురదృష్టకరం: జస్టిస్‌ ఎన్వీ రమణ

ఢిల్లీ: ఎస్పీ బాలు మరణం దురదృష్టకరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. ఎస్పీ బాలు మృతి తెలుగు జాతికే కాదని, సంగీత ప్రపంచానికే తీరని లోటని వ్యాఖ్యానించారు. విశ్వసంగీత సామ్రాట్‌గా, సంగీత సామ్రాజ్యంలో కీర్తి పతాక ఎగురవేసిన తెలుగు బిడ్డ అని కొనియాడారు. సమాజానికి సంగీతంతో పాటు మంచి సందేశాలు అందించిన మానవతావాదని ప్రశంసించారు. తెలుగు భాష, సంస్కృతికి, తెలుగు జాతి ఔన్నత్యానికి కృషి చేశారని తెలిపారు. ఎస్పీ బాలు మృతికి ఎన్వీ రమణ ప్రగాఢ సంతాపం తెలిపారు.

Updated Date - 2020-09-26T01:51:18+05:30 IST