అవార్డు గ్రహీతలకు ఎస్పీ అభినందనలు

ABN , First Publish Date - 2020-08-15T10:17:27+05:30 IST

ఏబీసీడీ అవార్డు పొందిన పోలీసులను జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు శుక్రవారం అభినందనలు తెలిపి సన్మానించారు. తనకల్లు మండలం కొర్తికోట గ్రామం

అవార్డు గ్రహీతలకు  ఎస్పీ అభినందనలు

అనంతపురం క్రైం, ఆగస్టు 14: ఏబీసీడీ అవార్డు పొందిన పోలీసులను జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు శుక్రవారం అభినందనలు తెలిపి సన్మానించారు. తనకల్లు మండలం కొర్తికోట గ్రామంలోని శివాలయంలో గత ఏడాదిలో జరిగిన త్రిబుల్‌ మర్డర్‌లో(పూజారితో పాటు మరో ఇద్దరిని) చేసిన  కేసును సాంకేతిక పరిజ్ఞానం జోడించి వారు కేసును ఛేదించి అవార్డు పొందిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఎస్పీ తన చాంబర్‌లో కదిరి డీఎస్పీ షేక్‌లాల్‌అహ్మద్‌, కదిరి రూరల్‌ సీఐ తమ్మిశెట్టి మధు, తనకల్లు ఎస్‌ఐ రంగుడు యాదవ్‌, టెక్నికల్‌ విభాగం ఎస్‌ఐ క్రాంతికుమార్‌, కానిస్టేబుళ్లు మూర్తి, యాసర్‌ఆలీ, తిరుమలేసు, భాస్కర్‌లకు సన్మానించి ప్రశంసించారు. 

Updated Date - 2020-08-15T10:17:27+05:30 IST