క్వారీల యజమానులతో జిల్లా ఎస్పీ రవీంద్రబాబు సమావేశం
ABN , First Publish Date - 2021-05-12T19:34:14+05:30 IST
విజయవాడ: కృష్ణా జిల్లాలోని క్వారీల యజమానులతో జిల్లా ఎస్పీ రవీంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు. క్వారీ యజమానులు నిబంధనలు పాటించడం లేదన్నారు.
విజయవాడ: కృష్ణా జిల్లాలోని క్వారీల యజమానులతో జిల్లా ఎస్పీ రవీంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు. క్వారీ యజమానులు నిబంధనలు పాటించడం లేదన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలోనే బ్లాస్టింగ్ చేయాలని సూచించారు. కొంత మంది ఎటువంటి పర్మిషన్లు లేకుండా రాత్రి సమయంలో కూడా బ్లాస్టింగ్కి పాల్పడుతున్నారని రవీంద్రబాబు తెలిపారు. మహేశ్వరి స్టోన్ క్వారీలో ఎటువంటి అనుమతులు లేని మెటిరియల్ ఉండటంతో వారిపై క్రిమినల్ కేసు నమోదు నమోదు చేశారు.
వీరికి మెటిరియల్ సరఫరా చేసిన ఈశ్వరి ఎంటర్ప్రైజెస్ ఓనర్పై కూడా కేసు నమోదు చేసిన రిమాండ్కు పంపుతామన్నారు.
ఎటువంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు.