జడ్జి రామకృష్ణ సోదరుడి మీద దాడి ఘటనపై ఎస్పీ స్పందన

ABN , First Publish Date - 2020-09-28T21:53:35+05:30 IST

జడ్జి రామకృష్ణ సోదరుడి మీద దాడి ఘటనపై ఎస్పీ సెంథిల్ కుమార్ స్పందించారు...

జడ్జి రామకృష్ణ సోదరుడి మీద దాడి ఘటనపై ఎస్పీ స్పందన

చిత్తూరు: జడ్జి రామకృష్ణ సోదరుడి మీద దాడి ఘటనపై ఎస్పీ సెంథిల్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రత్యక్ష సాక్షులను విచారించామని తెలిపారు. జడ్జి సోదరుడు రామచంద్ర, ప్రతాప్‌రెడ్డి పరస్పరం దాడికి పాల్పడ్డారని, ప్రతాప్‌రెడ్డి కూడ టీడీపీకి చెందిన వారేనని అన్నారు. దాడి ఘటనలో ఇనుప రాడ్లు వాడినట్లు సీసీ ఫుటేజీలో ఎక్కడా లేదని, శాంతిభద్రతల విఘాతానికి కొందరు ఇలా చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలోని అంశాలను విచారించామని ఎస్పీ సెంథిల్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో దాడి కేసు నిందితుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ బి.కొత్తకోట ఘటనను రాజకీయం చేసి తనని అబాసుపాలు చేశారని అన్నారు. తన తల్లి టీడీపీ తరపున ఎంపీటీసీగా నామినేషన్ వేశారని తెలిపారు. జడ్జి రామకృష్ణ సంఘవిద్రోహ శక్తిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2020-09-28T21:53:35+05:30 IST