పోలీసు సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2021-07-23T06:58:49+05:30 IST

పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు ఎస్పీ సిద్ధార్ధ్‌ కౌశల్‌ పేర్కొన్నారు. ఏఆర్‌ కానిస్టేబిల్‌ శివనాగరాజుకు హె డ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ గురువారం ఉత్తర్వులు అందజేశారు.

పోలీసు సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

మచిలీపట్నం టౌన్‌, జూలై 22 : పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు ఎస్పీ సిద్ధార్ధ్‌ కౌశల్‌ పేర్కొన్నారు. ఏఆర్‌ కానిస్టేబిల్‌ శివనాగరాజుకు హె డ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ గురువారం ఉత్తర్వులు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ, సుదీర్ఢ కాలం పని చేసినా పదోన్నతులు లేకుండా పదవీ విరమణ చేస్తున్నారన్నారు.  ఈ నేపథ్యంలో పదోన్నతులపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఏఆర్‌ ఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సూచించారు.   ఏఆర్‌ ఏఎస్పీ సత్యనారాయణ, ఎస్‌బీ  డీఎస్పీ ధర్యేంద్ర,  ఏఆర్‌ డీఎస్పీ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-23T06:58:49+05:30 IST