పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతిని ఉపేక్షించేది లేదు : ఎస్పీ

ABN , First Publish Date - 2021-07-30T06:38:49+05:30 IST

పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోలీసు సిబ్బంది ప్రవర్తిస్తే చర్యలు తప్పవని ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ హెచ్చరించారు.

పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతిని ఉపేక్షించేది లేదు : ఎస్పీ

  పామర్రు స్టేషన్‌ రైటర్‌ సస్పెన్షన్‌

మచిలీపట్నం టౌన్‌ : పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోలీసు సిబ్బంది ప్రవర్తిస్తే చర్యలు తప్పవని  ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన, ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించిన పామర్రు రైటర్‌ రాజులపాటి కిషోర్‌ను విధుల నుంచి ఆయన సస్పెండ్‌ చేశారు.  పామర్రు సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా  రైటర్‌ కిషోర్‌ ఫిర్యాదు స్వీకరించకపోగా, అమర్యాదగా ప్రవర్తించినట్లు  తన దృష్టికి తీసుకుని వచ్చారన్నారు.  ఈ విషయమై విచారణ చేసిన అనంతరమే  రైటర్‌ను సస్పెండ్‌ చేశామన్నారు. స్పందన  గురువారం ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు.  భర్త మరణించిన తరువాత అత్తమామలు వేధిస్తు న్నారని ఇనకుదురుకు చెందిన మహిళ ఫిర్యాదు చేశారు.  ఏఆర్‌ ఏఎస్పీ సత్యనారాయణ, ఎస్‌బి డీఎస్పీ ధర్మేంద్ర, ఎస్‌బిసీఐ శుభాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T06:38:49+05:30 IST