దండుమారమ్మను దర్శించుకున్న ఎస్పీ
ABN , First Publish Date - 2021-04-14T05:16:25+05:30 IST
నగరంలోని కంటో న్మెంట్లో గల దేవి దండుమారమ్మ అమ్మవారిని సోమవారం ఎస్పీ రాజకుమారి దర్శించుకున్నారు. అమ్మవారి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.
విజయనగరం క్రైం : నగరంలోని కంటో న్మెంట్లో గల దేవి దండుమారమ్మ అమ్మవారిని సోమవారం ఎస్పీ రాజకుమారి దర్శించుకున్నారు. అమ్మవారి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్పీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏఎస్పీ సత్యనారాయణరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితోపాటు ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు, ఆర్ఐలు చిరంజీవి, పీవీఆర్కే కుమార్, మిలియన్ రాజు, నాగేశ్వరరావు, రమణమూర్తి, ఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.