భారత్ బోణీ
ABN , First Publish Date - 2021-10-11T07:37:29+05:30 IST
ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గాయంతో మ్యాచ్ మధ్యలో వైదొలగినా.. ఉబెర్ కప్ ఫైనల్లో భారత మహిళల బృందం శుభారంభం చేసింది.
స్పెయిన్పై గెలుపు
ఉబెర్ కప్ ఫైనల్
గాయంతో సైనా
అర్ధంతర నిష్క్రమణ
ఆర్థస్ (డెన్మార్క్): ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గాయంతో మ్యాచ్ మధ్యలో వైదొలగినా.. ఉబెర్ కప్ ఫైనల్లో భారత మహిళల బృందం శుభారంభం చేసింది. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం జరిగిన తమ ఆరంభ పోరులో భారత్ 3-2తో స్పెయిన్పై గెలిచింది. తొలుత క్లారా అజుర్మెండీతో సింగిల్స్ పోరులో 20-22తో తొలి గేమ్ను కోల్పోయిన దశలో సైనా గాయంతో నిష్క్రమించింది. రెండో సింగిల్స్లో మాళవిక 21-13, 21-15తో బెట్రిజ్పై నెగ్గి 1-1తో భారత్ స్కోరు సమం చేసింది. అనంతరం డబుల్స్లో తనీషా/రుతుపర్ణా ద్వయం 21-10, 21-8తో పౌలా/లొరెనా జోడీని ఓడించింది. మూడో సింగిల్స్లో అదితీ భట్ 21-16, 21-14తో అనియా సెటిన్ని చిత్తు చేయడంతో భారత్ 3-1తో పోరు గెలిచింది. కానీ సిక్కిరెడ్డి/అశ్వినీ జంట 18-21, 21-14, 17-21తో అజుర్మెండీ/కొరాలెస్ జంట చేతిలో ఓడడంతో భారత్ ఆధిక్యం 3-2కి తగ్గింది.