చంద్రబాబును ఏక్షణంలో మూసేస్తారో తెలియదు: స్పీకర్

ABN , First Publish Date - 2020-09-23T03:09:39+05:30 IST

అమరావతిలో టీడీపీ వాళ్లు బాగా మెక్కేశారని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. అమరావతి విషయంలో సీబీఐ విచారణ వద్దంటున్నారని ..

చంద్రబాబును ఏక్షణంలో మూసేస్తారో తెలియదు: స్పీకర్

శ్రీకాకుళం: అమరావతిలో టీడీపీ వాళ్లు బాగా మెక్కేశారని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. అమరావతి విషయంలో సీబీఐ విచారణ వద్దంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వాళ్లంతా దొరలమన్నట్టు వ్యవహరిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే స్టేలు వెకేట్ చేయించుకోవాలని సూచించారు. చంద్రబాబును ఏక్షణంలో మూసేస్తారో తెలియదన్నారు. జగన్ మౌనం బద్దలైతే ప్రళయమేనని చెప్పారు. రాష్ట్రంలో కళ్లు, చెవులు లేని ప్రతిపక్షం ఉందని స్పీకర్ తమ్మినేని విమర్శించారు. 

Updated Date - 2020-09-23T03:09:39+05:30 IST