సచివాలయాలతో సుస్థిర పాలన: స్పీకర్‌

ABN , First Publish Date - 2020-09-30T10:39:24+05:30 IST

సుస్థిర పాలన కోసమే సచివాలయ వ్యవస్థను అందుబా టులోకి తీసుకువచ్చినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.

సచివాలయాలతో సుస్థిర పాలన: స్పీకర్‌

పాలకొండ (బూర్జ): సుస్థిర పాలన కోసమే సచివాలయ వ్యవస్థను అందుబా టులోకి తీసుకువచ్చినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవారం బూర్జ మండలంలోని కంట్లాం, ఓవీపేట, లచ్చయ్యపేటల్లో పర్యటించారు. కంట్లాంలో రూ.25 లక్షలతో సీసీరోడ్డు, మరో రూ.25 లక్షలతో  సైడ్‌డ్రైనేజీ పనులు ప్రారంభించారు. కం ట్లాంలో తాగునీటిని సమస్యను ఆయన దృష్టికి మహిళలు తీసుకురాగా, త్వరలో కుళా యిలకు శంకుస్థాపన చేస్తామని హామీఇచ్చారు. ఓవీపేటలో రూ.17.50లక్షలతో నిర్మిం చనున్న వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రం, రూ.21.80 లక్షలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రాలకు శంకుస్థాపన చేశారు.  లచ్చయ్యపేటలో నాడు-నేడు పనులను పరిశీలిం చారు. కార్యక్రమంలో ఖండాపు గోవిందరావు, బెజ్జిపురపు రామారావు, బుడుమూరు సూర్యారావు, జల్లు అప్పలనాయుడు, ఎస్‌.కోటేశ్వరరావు, సూరపు ఉదయ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T10:39:24+05:30 IST