ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-06-12T06:25:28+05:30 IST

జిల్లా పరిషత్‌ సభ్యులు గ్రామీణ ప్రాం తాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు.

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి
స్థాయీ సంఘ సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌

జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌

ఆదిలాబాద్‌అర్బన్‌, జూన్‌ 11: జిల్లా పరిషత్‌ సభ్యులు గ్రామీణ ప్రాం తాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు రైతులు, ముఖ్యంగా ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ రంగ సమస్యలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి రైతులకు  ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇవ్వాలని నకిలీ విత్తనాల పట్ల రైతుల ను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో స్థాయీ సంఘాల సభ్యులు, జడ్పీ సీఈవో గణపతి, ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-12T06:25:28+05:30 IST