ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రత్యేక బోర్డు
ABN , First Publish Date - 2021-01-17T09:01:45+05:30 IST
రాష్ట్రంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వంలోని ఇంజనీరింగ్ శాఖలు నిర్మించే భవనాలకు వాటి అవసరాలకు అనుగుణంగా నిర్మాణపరమైన, ఆర్థికపరమైన ప్రామాణికతను నిర్దేశించడం కోసం ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఈ బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తారని చెప్పారు. మరో నలుగురు నిపుణులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారని, ఆర్థిక శాఖలో భవనాల నిర్మాణ వ్యవహారాలు చూసే సెక్రటరీ మెంబర్ కన్వీనర్గా ఉంటారని జీవోలో పేర్కొన్నారు.