పట్టణాల్లో వాహనాలకు ప్రత్యేక ఛార్జింగ్ కేంద్రాలు: కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-10-30T21:08:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ విడుదల చేశారు. ఎంసీహెచ్‌ఆర్డీలో ఎలక్ట్రిక్

పట్టణాల్లో వాహనాలకు ప్రత్యేక ఛార్జింగ్  కేంద్రాలు: కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ విడుదల చేశారు. ఎంసీహెచ్‌ఆర్డీలో ఎలక్ట్రిక్ వాహనాలు- ఇంధన నిల్వలపై సమ్మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్, అజయ్ కొత్త పాలసీ విధానాన్ని ఆవిష్కరించారు. 2020-2030 వరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధానమైన ప్రకటన చేశారు. అంతేకాదు ఐదు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి భారీ ప్రోత్సాహం కల్పిస్తామని మంత్రులు తెలిపారు. నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తుల సంస్థ టీఎస్ జెన్ కో నియాయకం. తొలి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ రుసుము, రోడ్ టాక్స్ మినహాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు తయారీకేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని, పట్టణాల్లో వాహనాలకు ప్రత్యేక ఛార్జింగ్  కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. జాతీయ రహదారుల పక్కన ప్రతీ 50 కిలోమీటర్ చొప్పున ఛార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. టౌన్‌షిప్‌లలో ఛార్జింగ్ కేంద్రాల స్థాపనకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Updated Date - 2020-10-30T21:08:00+05:30 IST