ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక కృషి

ABN , First Publish Date - 2021-06-22T04:54:53+05:30 IST

మారు మూల గ్రామాల్లో నివాసముంటున్న ఆదివా సీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రామగుండం సీపీ సత్య నారాయణ పేర్కొన్నారు.

ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక కృషి
మాట్లాడుతున్న సీపీ సత్యనారాయణ

- సీపీ సత్యనారాయణ

వాంకిడి, జూన్‌ 21: మారు మూల గ్రామాల్లో నివాసముంటున్న ఆదివా సీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రామగుండం సీపీ సత్య నారాయణ పేర్కొన్నారు. పోలీసులు దత్తత తీసు కున్న మండలంలోని సర్కెపల్లి, కోలాంగుడ గ్రామాల్లో నిర్మించిన రోడ్డు, మంచినీటి వసతి, విద్యుత్‌ సౌకర్యాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆది వాసీలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి మావంతు కృషి చేస్తామన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమపథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని నిరుపేద కుటుంబా లకు బియ్యం, యువకులకు వాలీబాల్‌ కిట్స్‌ అందజే శారు. మండలంలో గిరిజనగ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ వారిసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న సీఐ సుధాకర్‌, ఎస్సై డీకొండ రమేష్‌ను అభి నందించారు. ఎస్పీఅడ్మిన్‌ సుదీంద్ర,డీఎస్పీ అచ్చేశ్వర్‌ రావు,సీఐసుధాకర్‌, ఎస్సైడీకొండ రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:54:53+05:30 IST