‘మాస్టర్ ప్లాన్’పై ప్రత్యేక సమావేశం
ABN , First Publish Date - 2021-07-23T05:15:44+05:30 IST
ఎర్రగుంట్ల నగర పంచాయతీలో అమలు చేయాలనుకుంటున్న మాస్టర్ప్లాన్పై స్థాని క ప్రజల నుంచి తీవ్ర వ్యతి రేకత వ్యక్తమవు తోందంటూ ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన ‘ఇదేమి మాస్టర్ ప్లాన్’కు భారీ స్పందన వచ్చింది.
ఎర్రగుంట్ల, జూలై 22: ఎర్రగుంట్ల నగర పంచాయతీలో అమలు చేయాలనుకుంటున్న మాస్టర్ప్లాన్పై స్థాని క ప్రజల నుంచి తీవ్ర వ్యతి రేకత వ్యక్తమవు తోందంటూ ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన ‘ఇదేమి మాస్టర్ ప్లాన్’కు భారీ స్పందన వచ్చింది. ఈ వార్త ఎర్రగుంట్లలో కలకలం సృష్టించింది. ఈవార్తను చదినవారు, తెలుసుకున్నవారు మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా భారీగా అభ్యంతరాలు తెలుపనున్నట్లు పేర్కొన్నారు. కొందరు కౌన్సిలర్లు ప్రజా ఆగ్రహాన్ని చైర్మన్తో చర్చించారు. ఈవిషయంపై ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అనుడా ఛైర్మన్ గురుమోహన్తో ఫోన్లో మాట్లాడినట్లు కోఆప్షన్ సభ్యుడు డి.సూర్యనారాయణరెడ్డి తెలిపారు. తనతోపాటు, వైసీపీ సీనియర్ నేతలు కేవీసుబ్బారెడ్డి, రామలింగారెడ్డిలను కడపకు పంపి గురుమోహన్, కమిషనర్తో చర్చించమని చెప్పారన్నారు. కడపలోని గురుమోహన్ కార్యాలయం లో మాస్టర్ప్లాన్పై చర్చించినట్లు తెలిపారు. ఈనెల 24వ తేదీ ఉదయం ఎర్రగుంట్లకు వచ్చి నగర పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరి అభ్యంతరాలకు వివరణ ఇస్తామని గురుమోహన్ తెలిపారన్నారు.