పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక : ఎమ్మెల్యే భాస్కర్‌రావు

ABN , First Publish Date - 2022-01-20T06:20:27+05:30 IST

పట్ణణ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు.

పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక : ఎమ్మెల్యే  భాస్కర్‌రావు
డైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మిర్యాలగూడ, జనవరి 19: పట్ణణ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే భాస్కర్‌రావు తెలిపారు. బుధవారం మునిసిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ప్రకా్‌షనగర్‌లో రూ.20లక్షలతో నిర్మితమయ్యే డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పట్టణంలో నిబంధలనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కట్టడాలను, ఆక్రమణలను గుర్తించే ప్రక్రి య కొనసాగుతుందన్నారు. మినీ రవీంద్రభారతి పనులను త్వరిగతిన పూర్తిచేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చ ర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పట్టణ సుందరీకరణపై ప్ర త్యేక శ్రద్ధ చూపేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం  నియోజకవర్గ పరిధిలో ప్రమాదాలకు గురై మరణించిన ఐ దుగురు కార్యకర్తల కుటుంబాలకు క్యాంపు కార్యాలయంలో ప్రమా ద బీమా చెక్కులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన తిరునగరు భార్గవ్‌, పీఏసీఎస్‌ చైర్మన వెలిశెట్టి రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు మట్టపల్లి సైదయ్య, నాయకులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఐల వెంకన్న, రాధాకృష్ణ, నాగలక్ష్మి నాగరాజు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-01-20T06:20:27+05:30 IST