ఓం సదనంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2020-12-01T05:08:28+05:30 IST

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తుమ్మికాపల్లి గేట్‌ సమీపంలోనున్న ఓం సదనంలో ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఓం సదనంలో ప్రత్యేక పూజలు

కొత్తవలస, నవంబరు 30: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తుమ్మికాపల్లి గేట్‌ సమీపంలోనున్న ఓం సదనంలో ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర పురోహిత, అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు అంపోలు ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 108 శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ప్రముఖ వేద పండితులు వేమకోటి జగన్నాథశర్మ, అంపోలు కిరణ్‌ శర్మల నేతృత్వంలో మహా శివలింగానికి పూజలు చేశారు. సోమవారం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Updated Date - 2020-12-01T05:08:28+05:30 IST