అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-12-02T06:28:49+05:30 IST

కార్తీక మాసం ఆఖరి బుధవారం సందర్భంగా షీలానగర్‌ అయ్యప్పస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకులు కృష్ణన్‌ నంబూద్రి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేసి పూలు, నగలతో అలంకరించారు.

అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు
ప్రత్యేక అలంకరణలో అయ్యప్పస్వామి

అక్కిరెడ్డిపాలెం, డిసెంబరు 1: కార్తీక మాసం ఆఖరి బుధవారం సందర్భంగా షీలానగర్‌ అయ్యప్పస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకులు కృష్ణన్‌ నంబూద్రి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేసి పూలు, నగలతో అలంకరించారు. అనంతరం అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మణికంఠ జ్యోతి భక్తసేవా సంఘం ఆద్వర్యంలో బి సురేష్‌రెడ్డి ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన నిత్యాన్న సమారాధనను మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె.రమేశ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిమెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోగాది సన్యాసిరావు, సంఘ సభ్యులు చరపాక నాగార్జున, నంబారు రాజు, ఎస్‌.విశ్వేశ్వరరావు,  బి.అప్పలస్వామి, టి.నూకునాయుడు, ఎన్‌.రమణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T06:28:49+05:30 IST