ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు: జగన్
ABN , First Publish Date - 2021-11-14T23:05:10+05:30 IST
ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని సీఎం జగన్ గుర్తుచేశారు. సదరన్ కౌన్సిల్ సమావేశంలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా
తిరుపతి: ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని సీఎం జగన్ గుర్తుచేశారు. సదరన్ కౌన్సిల్ సమావేశంలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలని, విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలుకాలేదని, ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు. రీసోర్స్ గ్యాప్నూ భర్తీ చేయలేదని జగన్ చెప్పారు.
‘‘తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించాలి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వాలి. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రేషన్ లబ్ధిదారుల గుర్తింపుపై కేంద్రం ప్రక్రియలో హేతుబద్ధత లేదు. దీనిపై వెంటనే సవణలు చేయాలి’’ అని జగన్ కోరారు.