దొంగతనాలపై ప్రత్యేక నిఘా : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-06-20T04:56:08+05:30 IST

రాయచోటి పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచి పాల్పడ్డ వారిపై ఉక్కుపాదం మోపుతామని రాయచోటి డీఎస్పీ వాసుదేవన్‌ పేర్కొన్నారు.

దొంగతనాలపై ప్రత్యేక నిఘా : డీఎస్పీ
చోరీ అయిన ద్విచక్రవాహనాలతో డీఎస్పీ వాసుదేవన్‌

గాలివీడు, జూన్‌19: రాయచోటి పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచి పాల్పడ్డ వారిపై ఉక్కుపాదం మోపుతామని రాయచోటి డీఎస్పీ వాసుదేవన్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని, అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చే సినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం ఎస్‌ఐ ఇనాయతుల్లా పోలీస్‌ సిబ్బందితో కలిసి వెలిగల్లు ప్రాజెక్టుకు సమీపంలో గుర్రాలమిట్ట వద్ద కదిరి- రాయచోటి ప్రధాన రహదారిపై వాహన తనిఖీ చేపట్టారన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా వెలిగల్లు వైపు నుంచి తూముకుంట గ్రామం ఎగువ మూలకు చెందిన మామిళ్ల వీరారెడ్డి అనే వ్యక్తి ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పాటు గతంలో ఆ వాహనం చోరీ అయినట్లు పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు అయినట్లుగా గుర్తించి, మోటార్‌ సైకిల్‌తో పాటు వీరారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారన్నారు. అతను ఈ వాహన మే కాకుండా రాయచోటి, అనంతపురం జిల్లా కదిరి, తాడిపత్రి పట్టణాల్లో మరో మోటారు సైకిళ్లను దొంగలించినట్లు ఒప్పుకున్నాడన్నారు. మిగిలిన మూడు వాహనాలు తన సొంత ఊరైన ఎగువమూలకు తూర్పు దిశలో కంపచెట్లలో దాచిపెట్టినట్లు చెప్పగా ఆ మూడు వాహనాలను గ్రామస్థుల సమక్షంలో పంచనామా నిర్వహించి నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకొని వీరారెడ్డిని అరెస్టు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె సీఐ యుగంధర్‌, ఏఎ్‌సఐ అంజిరెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-20T04:56:08+05:30 IST