విజయకీలాద్రిని సందర్శించిన శాసనసభ స్పీకర్‌ తమ్మినేని

ABN , First Publish Date - 2021-08-02T05:51:04+05:30 IST

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సతీసమేతంగా ఆదివారం పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రాన్ని సందర్శించారు.

విజయకీలాద్రిని సందర్శించిన శాసనసభ స్పీకర్‌ తమ్మినేని
శాసనసభ స్పీకర్‌ సీతారామ్‌కు మంగళశాసనాలు అందిస్తున్న చినజీయర్‌ స్వామి

తాడేపల్లి టౌన్‌, ఆగస్టు 1: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సతీసమేతంగా ఆదివారం పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్‌కు చినజీయర్‌స్వామి మంగళశాసనాలు అందించి తీర్థప్రసాదాలు అందించారు. అర్చకులు దివ్య క్షేత్రంలోని దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్పీకర్‌ దంపతులకు స్వామివార్ల శేష వస్త్రాలు అందించారు. జీయర్‌ ఆశ్రమ నిర్వాహకులు వేద పండితులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-02T05:51:04+05:30 IST