నిధులను సెప్టెంబరులోగా ఖర్చు చేయండి
ABN , First Publish Date - 2020-08-11T10:45:17+05:30 IST
గద్వాల జిల్లా పరిషత్కు వచ్చిన నిధులతో సెప్టెంబరులోగా పనులను పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత అన్నారు.
జడ్పీ ప్రత్యేక సమావేశంలో చైర్పర్సన్ సరిత
గద్వాల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లా పరిషత్కు వచ్చిన నిధులతో సెప్టెంబరులోగా పనులను పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత అన్నారు. సోమవారం జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి కేవలం జడ్పీటీల సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. జడ్పీకి వచ్చిన జనరల్ ఫండ్ రూ.కోటిని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 60శాతం నిధులను జడ్పీటీసీలకు, 40శాతం నిధులను జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఖర్చు చేయడానికి అంగీకారం కుదిరిందన్నారు. ఈమేరకు నిధుల కేటాయింపు చేశామన్నారు. ఆయా మండలాల్లో పనులను చేపట్టి సెప్టెంబరులోగా పూర్తి చేయాలని జడ్పీటీసీలను ఛైర్పర్సన్ కోరారు. వచ్చే నిధులను జడ్పీటీసీలకు సమంగా పంచాలని కొందరు కోరారు. వైస్ ఛైర్పర్సన్ సరోజమ్మ, సీఈవో ముసాయిదాబేగం పాల్గొన్నారు.
ఆర్వోబీకి వందేమాతరం పేరు ఖరారు చేయాలి
గద్వాల టౌన్ : పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ)రోడ్డుకు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావు పే రును ఖరారు చేయాలని గద్వాల సీనియర్ సిటిజన్స్ ఫోరం చైర్మన్ మోహ న్రావు కోరారు. సోమవారం జడ్పీ చైర్పర్సన్ సరితను కలిసి ఈ మేరకు ఆ యన వినతిపత్రం అందించారు. ఇప్పటికే ఈ విషయాన్ని కలెక్టర్ శ్రుతి ఓఝాకు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి విన్నవించామని తెలిపారు.