ఉద్యోగులకు 17 నుంచి 'స్పైస్ జెట్' వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-05-12T19:14:19+05:30 IST
ఈనెల 17 నుంచి తమ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించనున్నట్టు..
న్యూఢిల్లీ: ఈనెల 17 నుంచి తమ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించనున్నట్టు స్పైస్ జెట్ ఎయిర్స్లైన్ ప్రకటించింది. కంపెనీ స్పాన్సర్ చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ఢిల్లీ, గురుగావ్లో తొలుత ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ సౌకర్యం విస్తరించాలని భావిస్తోంది. వ్యాక్సినేషన్లో భాగంగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది, ఫ్లయిట్ సిబ్బంది సహా ఫ్రెంట్ లైన్ సిబ్బందికి ముందుగా వ్యాక్సినేషన్ అందించనున్నట్టు స్పైస్ జెట్ ప్రకటించింది. దేశం వ్యాప్తంగా 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి మూడో ఫేజ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను కేంద్రం ఈనెల 1న ప్రారంభించగా, లబ్ధిదారులు భారీగా ఉండటంతో వివిధ రాష్ట్రాలు ఇందుకు తగినట్టుగా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాయి. అయితే, డిమాండ్కు తగినంతగా వ్యాక్సిన్ సప్లయి లేదని పలు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.