నీరాతోపాటు తెలంగాణ వంటకాలు
ABN , First Publish Date - 2020-05-28T09:24:39+05:30 IST
ఔషధ గుణాలున్న నీరాతో పాటు తెలంగాణ పిండివంటలను సైతం అందుబాటులో తీసుకొచ్చేందుకు
ఖైరతాబాద్ మే 27 (ఆంధ్రజ్యోతి): ఔషధ గుణాలున్న నీరాతో పాటు తెలంగాణ పిండివంటలను సైతం అందుబాటులో తీసుకొచ్చేందుకు త్వరలోనే ఈట్స్ర్టీట్ సమీపంలో స్టాల్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీనివా్సగౌడ్ తెలిపారు. బుధవారం ఆయన పర్యాటక శాఖ ఎండీ బి.మనోహర్, ఇతర అధికారులు, గౌడ సం ఘం ప్రతినిధులతో కలిసి నెక్లె్సరోడ్డులో స్టాల్ ఏర్పాటయ్యే ప్రాంతాన్ని పరిశీలించి. అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విధ్వంసమైన కుల వృత్తులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వ వైభవం తెచ్చే పనుల్లో భాగం గా నీరా అమ్మకాలతో గీత కార్మికులకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. నీరా సహజ పానీయమని, రాబోయే రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో వీటిని ప్రారంభిస్తామని తెలిపారు. స్టాల్ ఏర్పాటుతో పాటు ఇతర పనుల కోసం రూ. 3 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఆయన వెంట టూరిజం శాఖ ఎస్ఈ అశోక్ కుమార్, డీఈ పర్శవేది, ఏఈ అజయ్ యాదవ్ తదితరులు ఉన్నారు.