తెలుగు న్యాయమూర్తులకు ఆత్మీయ సన్మానం

ABN , First Publish Date - 2021-12-02T08:36:46+05:30 IST

సుప్రీంకోర్టు తెలుగు న్యాయమూర్తులను ఢిల్లీలోని తెలుగు న్యాయవాదులు సన్మానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ,

తెలుగు న్యాయమూర్తులకు ఆత్మీయ సన్మానం

న్యూఢిల్లీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తెలుగు న్యాయమూర్తులను ఢిల్లీలోని తెలుగు న్యాయవాదులు సన్మానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహాను బుధవారం సన్మానించారు. కొన్ని వారాల క్రితం జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా న్యాయమూర్తిగా నియమితుడైన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని న్యాయవాదులు తెలిపారు. 

Updated Date - 2021-12-02T08:36:46+05:30 IST