టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా పొంగులేటి ప్రసాదరెడ్డి

ABN , First Publish Date - 2021-09-17T02:36:56+05:30 IST

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత పొంగులేటి ప్రసాదరెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా పొంగులేటి ప్రసాదరెడ్డి

ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత పొంగులేటి ప్రసాదరెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురానికి చెందిన ప్రసాదరెడ్డి.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయానా సోదరుడు. అయితే ప్రసాదరెడ్డిని టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడంతో ఖమ్మంలోని పొంగులేటి క్యాంప్‌ కార్యాలయంలో కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరు దయాకర్‌రెడ్డి గురువారం టీఆర్‌ఎస్‌ నాయకులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. తనను నియమించినందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్మోహనరెడ్డి, కె.చంద్రశేఖర్‌రావుకు ప్రసాదరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-09-17T02:36:56+05:30 IST