బీసీసీఐతో నైకీ కటీఫ్?
ABN , First Publish Date - 2020-07-05T08:48:09+05:30 IST
బీసీసీఐతో సుదీర్ఘకాలంగా సాగుతున్న క్రీడా ఉత్పత్తుల కంపెనీ నైకీతో ఒప్పందం ఈ సెప్టెంబరుతో ముగియనుంది. 2004 నుంచి టీమిండియా కిట్
న్యూఢిల్లీ: బీసీసీఐతో సుదీర్ఘకాలంగా సాగుతున్న క్రీడా ఉత్పత్తుల కంపెనీ నైకీతో ఒప్పందం ఈ సెప్టెంబరుతో ముగియనుంది. 2004 నుంచి టీమిండియా కిట్ స్పాన్సర్గా ఉంటూ వస్తున్న ఈ కంపెనీ అప్పటి నుంచి తమ ఒప్పందాన్ని క్రమం తప్పకుండా రెన్యువల్ చేసుకుంటూ వస్తోంది. చివరిసారిగా 2016లో నాలుగేళ్ల కోసం రూ.370 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ఇందులో మ్యాచ్ ఫీజు రూ.85 లక్షలతో పాటు రాయల్టీ సొమ్ము రూ.30 కోట్లు కూడా ఉంది. దీంట్లో భాగంగా క్రికెటర్లకు తమ లోగోలతో కూడిన జెర్సీలు, షూస్, గేర్స్ ఉచితంగా అందిస్తోంది. కానీ తాజా కరోనా నేపథ్యంలో అంతటా క్రీడా కార్యక్రమాలు నిలిచిపోవడంతో నైకీ మరోసారి ఒప్పందాన్ని కొనసాగించే ఆలోచన విరమించుకుంది. దీంతో బోర్డు కూడా టెండర్లను ఆహ్వానించాలనే ఆలోచనలో ఉంది.