శార్దూల్.. మొదలుపెట్టాడు ప్రాక్టీస్
ABN , First Publish Date - 2020-05-24T08:16:47+05:30 IST
శార్దూల్.. మొదలుపెట్టాడు ప్రాక్టీస్
పాల్ఘర్ (మహారాష్ట్ర): కరోనా కారణంగా రెండు నెలల బ్రేక్ తర్వాత మైదానంలో నెట్ ప్రాక్టీస్ ఆరంభించిన తొలి భారత క్రికెటర్గా పేసర్ శార్దూల్ ఠాకూర్ నిలిచాడు. కొంతమంది స్థానిక ఆటగాళ్లతో కలసి ఠాకూర్ సాధన చేశాడు. నిబంధనలకు లోబడే ప్రాక్టీ్సకు అనుమతించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. బౌలర్లు తమ సొంత బంతులతోనే బౌలింగ్ చేసినట్టు చెప్పారు. సాధనకు వచ్చిన ఆటగాళ్లందరికీ థర్మల్ స్ర్కీనింగ్ చేసినట్టు పేర్కొన్నారు.