క్రీడారంగంపై సీఎం ప్రత్యేక దృష్టి
ABN , First Publish Date - 2020-05-24T08:21:59+05:30 IST
క్రీడారంగంపై సీఎం ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడారంగంపై ప్రత్యేక దృష్టి సారించారని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాగా.. స్టేడియాలు తెరవాలని ఇటీవల కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్రంలో మార్గదర్శకాలు రూపొందించే విషయమై చర్చిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 97 నియోజకవర్గాల్లో ఇప్పటికే 34 స్టేడియాలు నిర్మించామని.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. క్రీడాభివృద్ధి కోసం మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేశారనీ.. రెండునెలల్లో ఈ కమిటీ విధి విధానాలతో పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందిస్తుందన్నారు.