యువత క్రీడల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-01-18T03:44:17+05:30 IST

విద్యతో పాటు యువత క్రీడల్లో రాణించాలని సోమశిల ప్రాజెక్ట్‌ మాజీ చైర్మన్‌, తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండ్లగుంట మధుబాబునాయుడు పేర్కొన్నారు.

యువత క్రీడల్లో రాణించాలి
విజేతలకు బహుమతులు అందజేస్తున్న కండ్లగుంట మధుబాబు నాయుడు

విజేతలకు బహుమతుల పంపిణీ

కావలి రూరల్‌, జనవరి 17: విద్యతో పాటు యువత క్రీడల్లో రాణించాలని సోమశిల ప్రాజెక్ట్‌ మాజీ చైర్మన్‌, తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండ్లగుంట మధుబాబునాయుడు పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లిలో కొత్తపల్లి కొత్తూరు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో విజేతలకు ఆదివారం సాయంత్రం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముధుబాబు నాయుడు మాట్లాడుతూ గ్రామంలో 17 ఏళ్లుగా  క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించడం ఆనంద దాయకమన్నారు. ఈ ఏడాది 17 జట్లు పాల్గొనగా ఫైనల్స్‌లో కొత్తపల్లి అరుంధతీయ వాడ టీం, ఎల్‌ఆర్‌ అగ్రహారం టీం తలపడగా కొత్తపల్లి టీం విజయం సాధించిందన్నారు. విజేతలకు మెదటి బహుమతిగా గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకుడు పొన్నగంటి రవీంద్రనాథ్‌ సహకారంతో రూ.7,116, పరిటాల యువసేన తరుపున కంటు రమేష్‌ రెండో బహుమతి ఎల్‌ఆర్‌ అగ్రహారం టీంకు రూ.5116 అందజేశారు. అలాగే మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ బహుమతిగా రూ.1116 చలంచర్లకు చెందిన టీడీపీ నాయకుడు గుర్రం సునీల్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో కంచర్ల రఘు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-18T03:44:17+05:30 IST