‘ఖేలో’ వర్సిటీ గేమ్స్ నేటినుంచే
ABN , First Publish Date - 2020-02-22T10:26:40+05:30 IST
తొలి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల క్రీడలు శనివారం మొదలవనున్నాయి. ఈ గేమ్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ప్రారంభించనున్న ప్రధాని మోదీ
కటక్: తొలి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల క్రీడలు శనివారం మొదలవనున్నాయి. ఈ గేమ్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ వర్శిటీ గేమ్స్లో దేశవ్యాప్తంగా 159 విశ్వవిద్యాలయాల నుంచి 3,400 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. మొత్తం 17 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఆతిథ్య కళింగ వర్సిటీ స్టార్ అథ్లెట్ ద్యూతీ చంద్ గేమ్స్కు ప్రధాన ఆకర్షణ కానుంది.