జాతీయ ఖోఖో శిక్షకుడిగా నరసింహారెడ్డి
ABN , First Publish Date - 2022-01-28T05:51:24+05:30 IST
జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో కబడీ, ఖోఖో కోచ్ పీ నరసింహారెడ్డి జాతీయ ఖోఖో జట్టు శిక్షకుడిగా ఎంపికయ్యారు.
గుంటూరు(క్రీడలు), జనవరి 27: జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో కబడీ, ఖోఖో కోచ్ పీ నరసింహారెడ్డి జాతీయ ఖోఖో జట్టు శిక్షకుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నియామక పత్రం అందుకున్నారు. ఢిల్లీలో జరిగే జాతీయ ఖోఖో జట్టు శిక్షణకు ఆయన శిక్షకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వీసీ ప్రభాకరరెడ్డి, అడ్మిన్ రామకృష్ణ, గుంటూరు సీఈవో శ్రీనివాసరావు, చీఫ్ కోచ్ మురళి, ఆంధ్రా ఖోఖో అధ్యక్ష, కార్యదర్శులు జీఎస్ఆర్కే ప్రసాద్, సీతారామిరెడ్డి, తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.