మచ్చలు పోతాయిలా..!
ABN , First Publish Date - 2021-04-24T17:22:37+05:30 IST
రాత్రి పడుకునే ముందు తేనెను ముఖానికి పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఒకవేళ చర్మం తెగిన గాట్లు ఉంటే తేనె ఉపయోగించకూడదు. ఎందుకంటే మంటను కలిగించే గుణం తేనెకు ఉంది.
ఆంధ్రజ్యోతి(24-04-2021)
రాత్రి పడుకునే ముందు తేనెను ముఖానికి పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఒకవేళ చర్మం తెగిన గాట్లు ఉంటే తేనె ఉపయోగించకూడదు. ఎందుకంటే మంటను కలిగించే గుణం తేనెకు ఉంది.
కలబందకు మచ్చలను పోగొట్టే గుణం ఉంది. అంతే కాకుండా దెబ్బతిన్న చర్మకణాలు తిరిగి పునర్నిర్మాణం అయ్యేందుకు తోడ్పడుతుంది. రోజుకు రెండు సార్లు కలబందను ముఖానికి పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.