పారిశుధ్య కార్మికులకు అండగా శ్రవంతి చారిటబుల్ ట్రస్టు
ABN , First Publish Date - 2021-05-17T06:24:00+05:30 IST
కొవిడ్ కష్టకాలంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అమోఘమని శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచనేని సత్య ప్రసాద్ అన్నారు.
హనుమాన్జంక్షన్ : కొవిడ్ కష్టకాలంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అమోఘమని శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచనేని సత్య ప్రసాద్ అన్నారు. ట్రస్ట్ కార్యాయలంలో ఆదివారం బాపులపాడు పంచాయితీలోని 40 మంది పారిశుధ్య కార్మికులకు మందులు, మాస్క్లు, చేతి గ్లౌజులు, శానిటైజర్లు, పండ్లు అందించారు. ఫ్రంట్లైన్ వారియర్స్గా పారిశుధ్య కార్మికుల సేవ లు అభినందనీయమన్నారు. పారిశుధ్య కార్మికులకు ఏ అవసరం వచ్చినా సహకారం అందిస్తానన్నారు. సర్పంచ్ భర్త కొమరవల్లి కిరణ్మూర్తి, ట్రస్ట్ సభ్యులు వీరమాచనేని బుజ్జి, మేడేపూడి రామ్మోహన్రావు, బోయపాటి ప్రసాద్, కంపసాటి కొండలరావు, నీలంశ్రీధర్, గొట్టాపు వాసుదేవరావు, దయాల ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.