Ind vs Srilanka: వన్డే, టీ20 సిరీస్కు జట్టును ప్రకటించిన శ్రీలంక
ABN , First Publish Date - 2021-07-17T00:17:13+05:30 IST
భారత్తో వన్డే, టీ20 సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 24 మంది ఆటగాళ్లతో కూడిన సవరించిన జట్టును ప్రకటించింది.
కొలంబో: భారత్తో వన్డే, టీ20 సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 24 మంది ఆటగాళ్లతో కూడిన సవరించిన జట్టును ప్రకటించింది. ఇరు జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండగా, ఆరు మ్యాచ్లకూ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది. భారత్తో సిరీస్ శ్రీలంకకు నిజంగా పెను సవాలే కానుంది. ఇటీవల ఇంగండ్లో పర్యటించిన లంకేయులను ఇంగ్లిష్ ఆటగాళ్లు వైట్వాష్ చేశారు. తీవ్ర అవమాన భారంతో సొంతగడ్డపై అడుగుపెట్టిన జట్టును కొవిడ్ ఇబ్బంది పెట్టింది. దీంతో సిరీస్ వెనక్కి జరిగింది.
జట్టు ప్రదర్శన దారుణంగా ఉండడంతో కెప్టెన్సీ పగ్గాలను కుశాల్ పెరీరా నుంచి దాసన్ శంకకు అప్పగించారు. అంతలోనే జట్టుకు నేడు మరో ఎదురుదెబ్బ తగిలింది. కుడి భుజానికి గాయంతో బాధపడుతున్న కుశాల్ పెరీరా వన్డే, టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ బినుర ఫెర్నాండో కూడా గాయంతో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. వీరిద్దరూ జట్టుకు దూరం కావడంతో 24 మందితో కూడిన సవరించిన జట్టును శ్రీలంక బోర్డు తాజాగా ప్రకటించింది. దాసన్ శంక వన్డే, శ్రీలంక జట్టుకు సారథ్యం వహించనుండగా, ధనంజయ డి సిల్వా అతడి డిప్యూటీగా వ్యవహరిస్తాడు.