శ్రీరామ పునర్వసు దీక్ష స్వీకరించిన భక్తులు

ABN , First Publish Date - 2020-12-05T05:13:57+05:30 IST

భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామ పునర్వసు దీక్షలను భక్తులు శుక్రవారం స్వీకరించారు.

శ్రీరామ పునర్వసు దీక్ష స్వీకరించిన భక్తులు
శ్రీరామ పునర్వసు దీక్ష స్వీకరిస్తున్న భక్తులు

భద్రాచలం, డిసెంబరు 4 : భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామ పునర్వసు దీక్షలను భక్తులు శుక్రవారం స్వీకరించారు. ఈ సందర్భంగా భద్రుని ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 27 రోజుల పాటు సాగే ఈ దీక్ష సందర్భంగా దీక్షితులకు రామాలయంలో స్వామి వారి ఉచిత దర్శనంతో  పాటు అన్నప్రసాదం అందజేస్తారు. ఈ నెల 31న శ్రీరామపునర్వసు దీక్ష ముగియనుండగా ఆ రోజు దీక్ష విరమణతో పాటు భద్రగిరి ప్రదక్షణ నిర్వహిస్తారు. అలాగే జనవరి ఒకటిన శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-05T05:13:57+05:30 IST