డాలస్‌లో శ్రీశ్రీ “మహాప్రస్థానం ప్రత్యేక సంచికల” ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-10-05T14:34:46+05:30 IST

తెలుగు భాషాభిమాని, ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన డాలస్, ఫోర్ట్ వర్త్ నగర పరిసర ప్రాంతాలలోని సాహితీప్రియులు ఫ్రిస్కో నగరంలోని దేశీ డిస్ట్రిక్ట్ రెస్టారెంట్లో సమావేశమై మహాకవి శ్రీశ్రీకి ఘన నివాళులర్పించారు.

డాలస్‌లో శ్రీశ్రీ “మహాప్రస్థానం ప్రత్యేక సంచికల” ఆవిష్కరణ

డాలస్, టెక్సాస్: తెలుగు భాషాభిమాని, ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన డాలస్, ఫోర్ట్ వర్త్ నగర పరిసర ప్రాంతాలలోని సాహితీప్రియులు ఫ్రిస్కో నగరంలోని దేశీ డిస్ట్రిక్ట్ రెస్టారెంట్లో సమావేశమై మహాకవి శ్రీశ్రీకి ఘన నివాళులర్పించారు. డా. తోటకూర ప్రసాద్ తన స్వాగతోపన్యాసంలో శ్రీశ్రీ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలను, ఆయన కలం నుండి వెలువడ్డ వివిధ రచనలను గుర్తు చేశారు. వెయ్యేళ్ళ సాహిత్య చరిత్రలో శ్రీశ్రీ “మహాప్రస్థానం” ఒక గొప్ప కవితా సంకలనంగా చిరస్థాయిగా నిలిచిపోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న విషయాన్ని తెలియజేశారు. అలాగే మహాప్రస్థానాన్ని శ్రీశ్రీ తన సన్నిహిత మిత్రుడు కొంపల్లె జనార్ధనరావుకి అంకితం ఇవ్వడానికి గల కారణాలను వివరించి శ్రీశ్రీ రాసిన “అంకిత గీతం” చదివి సభను ప్రారంభించారు. అనంతరం ఒక్కొ వక్తను పరిచయం చేసి మహప్రస్థానంలోని కవితలను చదవమని ఆహ్వానం పలికారు. 


ఈ ప్రత్యేక సాహిత్య సమావేశంలోఅనంత్ మల్లవరపు, ఎం.వి.ఎల్ ప్రసాద్, డా. అరుణజ్యోతి కోల, రాజశేఖర్ సూరిభొట్ల, రావు కల్వాల, డా. విశ్వనాధంపులిగండ్ల, డా. నక్త రాజు, డా. రమణ జువ్వాడి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కిరణ్మయి గుంట, డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, భాస్కర్ రాయవరం, శారద సింగిరెడ్డి, మురళి వెన్నం, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, లెనిన్ వేముల, చంద్రహాస్ మద్దుకూరి, చినసత్యం వీర్నపు, రాజేశ్వరి ఉదయగిరి, డా. జగదీశ్వరన్ పుదూర్, దయాకర్ మాడలు అందరూ కలసి మహాప్రస్థానంలోని మొత్తం 40 కవితలను భావగర్భితంగా చదివి సభను రంజింపజేశారు. విశ్వేశ్వరరావు కంది, సురేష్ మానుకొండ,చి. సింధు వేముల, చి. సాహితి వేముల, శాంతా పులిగండ్ల, సుందర్ తురిమెల్ల, వెంకట్ ములుకుట్ల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్ కూడా అత్యంత ఉత్సాహంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.  


సమావేశం చివరిలో ఇటీవలే విజయవాడలోని శ్రీశ్రీ ప్రింటర్స్ వారు రెండున్నర కిలోల బరువు, 14’ X 19’ పరిమాణంలో ఉండేటట్లు ముద్రించిన శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక ప్రతులను ఆవిష్కరించారు. విజయవాడ సాహితీ మిత్రులు విశ్వేశ్వరరావు, బండ్ల మాధవరావు, టి. శ్రీనివాసరెడ్డి ప్రభ్రుతులునిర్వహించిన కార్యక్రమ స్పూర్తితో ఈ కార్యక్రమం చేపట్టామని ఎంతో శ్రద్ధతో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఇలాంటి పుస్తకాన్ని శ్రీశ్రీ ప్రింటర్స్ వారు ప్రచురించడం అభినందనీయం అన్నారు. డాలస్‌లోని కొంతమంది సాహితీ ప్రియులు ఆ పుస్తకాలను సొంతం చేసుకుని, ఒకచోట చేరి మహాప్రస్థానంలోని మొత్తం 40 కవితలను చదివి, 25 మహాప్రస్థానం ప్రతులను ఒకేసారి ఆవిష్కరించడం సాహితీ జగత్తులో ఒక చరిత్ర అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.





Updated Date - 2021-10-05T14:34:46+05:30 IST