AP: శ్రీకాకుళం జిల్లాలో పడవ బోల్తా.. ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-08-14T13:15:34+05:30 IST

జిల్లాలోని గార మండలం బందరువానిపేట తీరంలో విషాదం చోటు చేసుకుంది వేకువ జామున చేపల

AP: శ్రీకాకుళం జిల్లాలో పడవ బోల్తా.. ఒకరు మృతి

శ్రీకాకుళం: జిల్లాలోని గార మండలం బందరువానిపేట తీరంలో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ వేకువ జామున చేపల వేటకు వెళ్లిన పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. పడవలో ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు మత్స్యకారులు గల్లంతవగా ఒకరు మృతి చెందారు. సురక్షితంగా బయటపడ్డ మిగిలిన ముగ్గురు మత్స్యకారులు.. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన  ముగ్గురు మత్స్యకారుల కోసం తోటి మత్స్యకారులు, మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2021-08-14T13:15:34+05:30 IST